ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 26, 2020, 12:12 AM IST

ETV Bharat / state

చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టుకు ఎమ్మెల్సీ లేఖ

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్​లు లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని.. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించి ... చర్యలు తీసుకునేలా పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

mlc venanpusa gopalreddy letter to highcoourt on  tdp  leaders violated rules
హైకోర్టు

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్​లు లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని.. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించి ... చర్యలు తీసుకునేలా పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

హైదరాబాద్ నుంచి చంద్రబాబు, నారా లోకేష్​లు కరకట్ట వద్దనున్న తమ నివాసానికి వచ్చారు. వారు వచ్చేటప్పుడు..తెదేపా నాయకులు రహదారి వెంట స్వాగత కార్యాక్రమాలు నిర్వహించారని.... మార్గమధ్యలో పలు చోట్ల కాన్వాయ్​లను ఆపారని పేర్కొన్నారు. పలువురు కార్యకర్తలు మాస్కులు ధరించకుండా..భౌతిక దూరం పాటించకుండా అక్కడికి చేరారని.... ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన లేఖలో రాశారు. చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.

ఇదీచూడండి.గోవిందుడి ఆస్తుల అమ్మకంపై గొడవ గొడవ

ABOUT THE AUTHOR

...view details