ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలో సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ - మైలవరంలో సీఎంఆర్​ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు

కృష్ణా జిల్లా మైలవరంలోని సీఎంఆర్​ఎఫ్ లబ్ధిదారులకు.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెక్కులు అందజేశారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం జగన్ పలు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందన్నారు.

mylavaram mla vasanta krishna prasad, cmrf cheques distribution in mylavaram
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మైలవరంలో సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

By

Published : Mar 31, 2021, 8:28 PM IST

ప్రజారోగ్యాన్ని పెంపొందిస్తూ.. సంక్షేమానికి పాటుపడటమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు స్థానిక పార్టీ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో సుమారు రూ. 2 కోట్లు కేటాయించి.. తక్షణమే అందిస్తున్నామని తెలిపారు.

ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి.. కోట్లాది రూపాయల ఆర్థిక సాయం చేస్తోంని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details