ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2020, 5:13 PM IST

ETV Bharat / state

ప్రజలు సామాజిక దూరం పాటించి రేషన్​ తీసుకోవాలి:మంత్రి వెల్లంపల్లి

ముఖ్యమంత్రి జగన్​ నిర్ణయం మేరకు ఇవాళ్టి నుంచే రేషన్ బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ.. సరుకులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Minister Vellampalli told On Rice Distribution
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వెల్లంపల్లి

ప్రభుత్వం నిర్ణయం మేరకు తెల్లకార్డుదారులకు ఇవాళ్టి నుంచి బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరుకులు పంపిణీ చేస్తామన్నారు. సరుకులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని... వచ్చే నెల 15 వరకు ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సామాజిక దూరం పాటిస్తూ... ఇంటికి ఒకరు మాత్రమే వచ్చి సరుకులు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వేలిముద్రలు, ఐరిస్ లేకుండానే... సంతకం చేసి తీసుకుంటే సరిపోతుందని సూచించారు.

విదేశాల నుంచి వచ్చేవారి సమాచారం సేకరిస్తున్నాం

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని.. ఐసోలేషన్​ వార్డుల్లో ఉంచామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి.. తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి:

ఇవాళ రేషన్​ షాపుల్లో నిత్యావసరాల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details