ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రి పేర్ని నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ కన్నుమూత

By

Published : Nov 19, 2020, 3:45 PM IST

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఇంట విషాదం జరిగింది. అనారోగ్యంతో ఆయన మాతృమూర్తి కన్నుమూశారు.

perni nani
perni nani

తల్లితో మంత్రి పేర్ని నాని(పాత చిత్రం)

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాతృమూర్తి నాగేశ్వరమ్మ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం కన్నుమూశారు. భౌతికకాయాన్ని మచిలీపట్నంలోని పేర్ని నివాసానికి తీసుకురాగా... పలువురు ప్రముఖులు, స్థానికులు నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details