దసరా దృష్ట్యా ఆర్టీసీ(apsrtc news) 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు(minister perni nani on special Buses for dussehra news). గన్నవరంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం రేపు ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుటులోకి రానుందని వివరించారు. ఆన్లైన్ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు.
Minister Perni Nani: దసరా దృష్ట్యా 4 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు: పేర్ని నాని - minister perni nani on special Buses for dussehra news
minister perni nani on special Buses for dussehra
15:01 October 08
minister perni nani on special Buses for dussehra
'దసరా దృష్ట్యా 4 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాం. ఎక్కువ ధర వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదుల కోసం రేపట్నుంచి వాట్సప్ నెంబర్ ఇస్తాం' - మంత్రి పేర్ని నాని
ఇదీ చదవండి
Minister Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
Last Updated : Oct 8, 2021, 3:28 PM IST