ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంను న్యాయపరంగానే ఎదుర్కొంటాం:మంత్రి కొడాలి నాని

పోలవరం టెండరింగ్ ప్రక్రియను తాత్కలికంగానే నిలుపుదల చేయమని హైకోర్టు చెప్పిందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్ అడుగులు ముందుకే ఉంటాయని ఆయన తెలిపారు.

By

Published : Aug 22, 2019, 7:51 PM IST

కొడాలి నాని

ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు చెప్పలేదు

పోలవరం విషయంలో ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని మంత్రి కొడాలి నాని అన్నారు.టెండరింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయమని మాత్రమే చెప్పిందన్నారు.అవినీతి,దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తెచ్చారని కొడాలి పేర్కొన్నారు.ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని వివరించారు.పోలవరం విషయంలో ముఖ్యమంత్రి అడుగులు ముందుకే కాని వెనుకకు పడవని చెప్పారు.

మంత్రి బొత్స మాటల్లో తప్పులేదు

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి అన్నారు.రాజధాని ని తరలిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.రాజధానిలో జరిగిన అవినీతి,అక్రమాలపై చర్చ జరగాలన్నారు.ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే తెదేపా నేతల ఉద్యమాలు తమను ఆపగలవా అని ప్రశ్నించారు.


ఇది కూడా చదవండి.

"రాష్ట్రానికి పరిశ్రమలను రానివ్వకుండా బెదిరిస్తున్నారు"

ABOUT THE AUTHOR

...view details