ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయాలపై దాడులను ఖండించిన శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు - విగ్రహాల ధ్వంసంపై శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు స్పందన వార్తలు

హిందూ ధర్మంలో అనేక సంప్రదాయ బేధాలున్నప్పటికీ- అవి ధర్మ సంరక్షణకు విఘాతం కాకూడదని శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్ధ స్వామి ఆకాంక్షించారు. రాష్ట్రంలో దేవతామూర్తుల విగ్రహాలపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఆయన లేఖ ద్వారా తన సందేశాన్ని తెలియపరిచారు. పీఠం ధర్మాధికారి హనుమత్ ప్రసాద్ విజయవాడలో మీడియా ముందు స్వామివారి సందేశాన్ని చదివి వినిపించారు.

bharati thirdha swamy on the destruction of idols
సందేశాన్ని చదివి వినిపించిన పీఠం ధర్మాధికారి

By

Published : Jan 11, 2021, 3:14 PM IST

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్ధ స్వామి ఖండించారు. కారకులైన వారిని గుర్తించి శిక్ష విధించాలని కోరారు. దాడులు అత్యంత దుఃఖాన్ని కలిగిస్తున్నాయన్న ఆయన.. భగవంతుని విషయంలో జరుగుతున్న ఇలాంటి అపరాధాలకు పాల్పడిన వారిని జన్మజన్మల దుఃఖం వెంటాడుతుందని తెలిపారు. స్వామి తరఫున తన సందేశాన్ని పీఠం ధర్మాధికారి హనుమత్ ప్రసాద్ విజయవాడలో మీడియా ముందు చదివి వినిపించారు. దాడులు మహాపాపమని.. ఇవి రాజ్యాంగానికి కూడా అత్యంత విరుద్ధమని.. దీనివల్ల దేశ ప్రజల సామరస్యానికి భంగం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా దుశ్చర్యలను ఆరంభ దశలోనే నివారించి- పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details