ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2020, 9:12 PM IST

ETV Bharat / state

కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాజిల్లా నందివాడ మండలం పోలుకొండలో చోటు చేసుకుంది. భర్తతో వివాదాలు కారణంగా మనస్థాపానికి గురైన మహిళ ఫ్యాన్​కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

marriage women suicide at gudivada
కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య

కృష్ణాజిల్లా నందివాడ మండలం పోలుకొండలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే సుజాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తతో కొంత కాలంగా వివాదాలు కొనసాగడం వల్ల మనస్థాపానికి గురైన సుజాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యాన్​కు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details