ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2021, 8:27 PM IST

ETV Bharat / state

దివిసీమకు సాగునీరు విడుదల చేయాలి: మండలి బుద్ధప్రసాద్

కృష్ణానది నుంచి సముద్రానికి నీటిని వదిలి...కేఈబీ కెనాల్​కు సాగునీరు విడుదల చేయకపోవడం దారుణమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

దివిసీమకు సాగునీరు విడుదల చేయాలి: మండలి బుద్ధప్రసాద్
దివిసీమకు సాగునీరు విడుదల చేయాలి: మండలి బుద్ధప్రసాద్

ప్రకాశం బ్యారేజ్​ నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణానది నుంచి సముద్రానికి వదిలి, కేఈబీ కెనాల్​కు సాగునీరు విడుదల చేయకపోవడం దారుణమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టాలోని చివరి ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గానికి గతంలో సాగునీటి విడుదల జరిగందని, ప్రస్తుత ప్రభుత్వంలో చివరి భూములకు నీరు అందని పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దివిసీమలోని చెరువులలో నీరు అడుగంటిందన్నారు. సమృద్ధిగా నీరు ఉండి కూడా విడుదల చేయకపోవడం విచిత్రంగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details