ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 21, 2021, 10:12 PM IST

ETV Bharat / state

కొవిడ్​తో వ్యక్తి మృతి.. చివరి తంతు జరిపించిన పంచాయతీ సిబ్బంది

కరోనాతో మృతి చెందిన వ్యక్తికి పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో కొవిడ్​ కారణంగా ప్రాణాలు విడిచిన వ్యక్తికి దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవటంతో.. పంచాయతీ సిబ్బంది పెద్ద మనస్సు చాటుకున్నారు.

Panchayat staff done last ceremonies
దహన సంస్కారాలు చేసిన పంచాయతీ సిబ్బంది

కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో కరోనా వ్యాధి సోకి ఇంటి వద్దే 45 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవటం ప్రస్తుతం పరిస్థితికి అద్దం పడుతోంది. చేసేది లేక మొవ్వ గ్రామ పంచాయతీ సిబ్బంది.. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం చాటిన పంచాయతీ సిబ్బందిని పలువురు అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details