ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బంగారం దొంగిలించిన వ్యక్తి అరెస్ట్

కృష్ణా జిల్లా విజయవాడలో నకిరికంటి సీతామహాలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కుని పరారైన ఘటనలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. సీసీ ఫూటేజీ ఆధారంగా మానేపల్లి లక్ష్మణరావుగా గుర్తించి అరెస్ట్ చేశారు.

By

Published : Oct 15, 2020, 4:28 PM IST

Published : Oct 15, 2020, 4:28 PM IST

బంగారం దొంగలించిన వ్యక్తి అరెస్ట్
బంగారం దొంగలించిన వ్యక్తి అరెస్ట్

ఈ నెల 4న పట్టణంలోని అమ్మాని కళాశాల సమీపంలో రాత్రి 8 గంటల సమయంలో నకిరికంటి సీతామహాలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కుని దొంగలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీస్ శాఖ సీసీ ఫూటేజీ ఆధారంగా మానేపల్లి లక్ష్మణరావుగా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రెండు లక్షల విలువైన 44 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలియజేశారు. నిందితుడు లక్ష్మణరావు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details