Person Traveling On Horse: సహజంగా మనం ప్రయాణం చేయాలంటే బస్సు, కారు లేదా ద్విచక్ర వాహనం ద్వారా ప్రయాణిస్తుంటాం. కానీ ఓ పెద్దాయన తన చిన్ననాటి నుంచి తాను పెంచుకుంటున్న గుర్రాన్నే వాహనంగా మలుచుకున్నాడు. తాను పని కోసం ఎక్కడికి వెళ్లినా.. తన అశ్వం మీదే వెళ్తుంటాడు. ఆ వ్యక్తి పేరే ముంతాజ్ దేశాయ్. మహారాష్ట్ర సరిహద్దుల్లోని మేదన్ కల్లూరు గ్రామంలో ఈయన నివాసం ఉంటున్నాడు. తమ గ్రామం నుంచి మద్నూర్, కోటగిరి తదితర మండలాలకు గుర్రం పైనే వచ్చి పనులు చేసుకుని తిరిగి వెళ్తానని ఆయన చెబుతున్నారు. ఈ రోజుల్లో గుర్రంపై వెళ్తుండటం అరుదుగా కనిపిస్తుంది. ఈరోజుల్లోనూ గుర్రంపై వెళ్తున్న ముంతాజ్ దేశాయ్ను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
నా రూటే సెపరేటు.. నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదు - గుర్రంపై ప్రయాణిస్తున్న మహారాష్ట్ర వ్యక్తి
Person Traveling On Horse: సాధారణంగా ఈ రోజుల్లో ద్విచక్ర వాహనాలు.. కార్లు ఇతర వాహనాలపై ఎక్కడకైనా వెళ్తుంటాం. కానీ ఆయన మాత్రం అందుకు భిన్నంగా ఎక్కడికైనా గుర్రం పైనే వెళ్తాడు. ఆయనే ముంతాజ్ దేశాయ్. ఆయన గురించి ఒకసారి తెలుసుకుందామా..?

Etv Bharat
ఆ వ్యక్తికి గుర్రమే వాహనం.. ఎక్కడికి వెళ్లిన సరే అలానే వెళతాడు