ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్యే బలపర్చిన వారినే అభ్యర్థులుగా పరిగణించాలి'

తొలి విడత ఎన్నికలు జరిగే విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు, నున్న, నిడమానూరులో ఎమ్మెల్యే వంశీమోహన్ బలపర్చిన వారిని మాత్రమే అభ్యర్థులుగా పరిగణించాలని ఆ పార్టీ నేత గౌతమ్ రెడ్డి అన్నారు. అభ్యర్థుల గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.

By

Published : Feb 7, 2021, 5:13 PM IST

మచిలీపట్నం పార్లమెంట్, గన్నవరం నియోజకవర్గ వైకాపా పరిశీలకులు గౌతమ్ రెడ్డి
మచిలీపట్నం పార్లమెంట్, గన్నవరం నియోజకవర్గ వైకాపా పరిశీలకులు గౌతమ్ రెడ్డి

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీమోహన్ బలపర్చిన వారినే వైకాపా అభ్యర్థులుగా పరిగణించాలని... మచిలీపట్నం పార్లమెంట్, గన్నవరం నియోజకవర్గ వైకాపా పరిశీలకులు గౌతమ్ రెడ్డి, పైలా సోమినాయుడు.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పంచాయతీ ఎన్నికల్లో వాక్ ​స్వాతంత్య్రాన్ని హరించే విధంగా వ్యవహారిస్తే ఊరుకోబోమని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్​ లో ముఖ్యమంత్రి చిత్రం కనిపిస్తోందని ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టిన గౌతమ్ రెడ్డి.. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరని పేర్కొన్నారు. అభ్యర్థుల గెలుపునకు వైకాపా శ్రేణులు, సానుభూతి పరులు పనిచేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details