Lokesh on YS Jagan: నేరాలు-ఘోరాల్లో జగన్ రెడ్డి ఏ1 అని మరోసారి నిరూపించుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో ఆర్థిక నేరాల కేసులు 9వేల 273కి పెంచడం జగన్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. పర్యావరణ నిబంధలను అతిక్రమించిన కేసులు 2019లో 188 నమోదు కాగా, ప్రస్తుతం 420కి చేర్చిన ఘనతని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఓ రికార్డుగా గుర్తించిందని లోకేశ్ తెలిపారు. 2021లో దేశవ్యాప్తంగా 76 దేశద్రోహం కేసులు నమోదైతే, అందులో 29 దేశద్రోహం కేసులు నమోదు చేసి నెంబర్వన్గా నిలిచారని మండిపడ్డారు.
జగన్ రెడ్డి పాలనలో.. నేరాల్లో రాష్ట్రం నెంబర్ వన్: లోకేశ్ - చంద్రబాబు తాజా
Lokesh on YS Jagan: నేరాలు-ఘోరాల్లో జగన్ రెడ్డి ఏ1 అని మరోసారి నిరూపించుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో ఆర్థిక నేరాల కేసులు 9వేల 273కి పెంచడం జగన్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు.
![జగన్ రెడ్డి పాలనలో.. నేరాల్లో రాష్ట్రం నెంబర్ వన్: లోకేశ్ lokesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16256323-223-16256323-1662030261938.jpg)
lokesh
అధిక ధరలు, అరాచక పాలన, విధ్వంసం భరించలేక కడుపుమండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందరిపైనా జగన్ పీనల్ కోడ్ వాడి దేశద్రోహం కేసులు బనాయించారన్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్గా నిలిస్తే.. జగన్రెడ్డి పాలనలో నేరాల్లో నెంబర్వన్ అయ్యిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడించాయని లోకేశ్ విమర్శించారు.
ఇవి చదవండి: