ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2020, 4:58 PM IST

Updated : Feb 27, 2020, 6:48 PM IST

ETV Bharat / state

చంద్రబాబు యాత్రను అడ్డుకోవటంపై లోకేశ్ ఫైర్

చంద్రబాబు యాత్రను విశాఖలో వైకాపా అడ్డుకోవడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. మూడు ముక్కలాట మొదలు పెట్టి సగం చచ్చారు, ప్రతిపక్షనేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారని ధ్వజమెత్తారు. వైకాపా డీఎన్ఏలో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖలో బయటపడ్డాయన్నారు. జగన్​మోహన్​రెడ్డి విశాఖలో అడుగుపెడితే ఉత్తరాంధ్రలో అరాచకం ఏ రేంజ్​లో ఉంటుందో వైకాపా ఈ రోజు ట్రైలర్ చూపించిందన్నారు. ప్రతిపక్షనేతపై ఈ రోజు గుడ్లు, టొమేటోలు వేయించారని.... రేపు ప్రజలపై బాంబులు, కత్తులతో దాడులకు దిగుతారని ట్విట్టర్‌లో తెలిపారు.

చంద్రబాబు యాత్రను అడ్డుకోవటంపై లోకేశ్ ఫైర్
చంద్రబాబు యాత్రను అడ్డుకోవటంపై లోకేశ్ ఫైర్

చంద్రబాబు యాత్రను అడ్డుకోవటంపై లోకేశ్ ట్విట్టర్​లో ఫైర్
Last Updated : Feb 27, 2020, 6:48 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details