ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 30, 2020, 4:14 PM IST

ETV Bharat / state

బురద రాజకీయాలు మాని వరద బాధితులను ఆదుకోండి: లోకేశ్

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ చెబుతున్న నష్ట పరిహార అంచనా.. కేవలం పత్రికల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనపడటం లేదని విమర్శించారు.

lokesh comments
lokesh comments

వైకాపా నాయకులు బురద రాజకీయం మాని ముందు వరద బాధితులను ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ హితవు పలికారు. లంక గ్రామాలు మునిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

కంద, పసుపు, పత్తి, మినుము, అరటి, మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. సీఎం జగన్ రెడ్డి చెబుతున్న నష్ట పరిహార అంచనా.. కేవలం పత్రికల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనపడటం లేదని విమర్శించారు. త్వరితగతిన అంచనా నివేదికలు పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details