కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వం మెరక (లోతు ప్రాంతాల ఎత్తు పెంచటం) పనులు చేపడుతోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు నిర్వహిస్తున్నారు. అయితే కేవలం కొంత వరకు మాత్రమే మట్టిని మెరకుకు ఉపయోగిస్తున్నారని.. మిగతాది అర్థరాత్రి సమయంలో అక్రమంగా బయటకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మట్టి దోపిడీ, అక్రమ విక్రయాలపై, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని విమర్శించారు. పంచాయతీ ఈవోని వివరణ కోరగా ఆమె సెలవులో ఉన్నట్టు తెలియజేశారు. ఈనెల ఏడో తేదీన ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మెరక మట్టిని విక్రయిస్తున్న అధికార పార్టీ నేతలు.. - Illegal sale of soil in the Palmer Zone mandal
కృష్ణాజిల్లా పామర్రు మండలంలో కొందరు అధికార పార్టీ నాయకులు మట్టిదోపిడీకి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వం మెరక(లోతు ప్రాంతాల ఎత్తు పెంచటం) చేయిస్తుండగా.. అందుకు తరలిస్తున్న మట్టిని అక్రమంగా బయటకు తరలిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని విమర్శించారు.
![మెరక మట్టిని విక్రయిస్తున్న అధికార పార్టీ నేతలు.. Selling clay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12080868-606-12080868-1623313449026.jpg)
అక్రమంగా మట్టి అమ్మకం