ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చండ్రగూడెం వద్ద పోలీసులు తనిఖీలు.. ముగ్గురి అరెస్టు - liquor illegal transport at krishna district

అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా మైలవరం పొందుగల, చండ్రగూడెం గ్రామాల్లో ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

liquor illegal transport
పోలీసుల తనిఖీల్లో ముగ్గురు అరెస్టు

By

Published : Jul 2, 2020, 4:32 PM IST

కృష్ణా జిల్లా మైలవరం పొందుగల, చండ్రగూడెం గ్రామాల్లో ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో ఇన్​స్పెక్టర్​ పెద్దిరాజు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారివద్ద నుంచి 378 మద్యం బాటిళ్లు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పెద్దిరాజు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details