ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్త బంద్​కు వామపక్షాల పిలుపు - విశాఖ ఉక్కు పరిశ్రమ

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి అయిదో తేదీన రాష్ట్రవ్యాప్త బంద్​కు వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి కలిగేలా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆరోపించారు.

left parties conduct state bandh on march fifth against vizag steel plant privatization
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి

By

Published : Mar 3, 2021, 5:34 PM IST

Updated : Mar 3, 2021, 8:25 PM IST

మార్చి 5వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్​కు పిలుపునిస్తూ విజయవాడలో వామపక్ష పార్టీల నేతలు గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు ఆర్​ నారాయణమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఎందరో ప్రాణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించారని అన్నారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా భాజపా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేస్తే కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మార్చి 5న జరిగే ఈ బంద్​లో అన్ని పార్టీలు ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

Last Updated : Mar 3, 2021, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details