ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేడుకగా లక్ష దీపార్చన.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన - విజయవాడలో కార్తీక దీపోత్సవం

కార్తీక దీపోత్సవంలో భాగంగా విజయవాడలో లక్ష దీపార్చన కార్యక్రమం వేడుకగా జరిగింది. కరోనా మహమ్మారిని పారదోలాలనే సత్సంకల్పంతో ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తాళ్లాయపాలెం శైవక్షేత్రానికి చెందిన శివ స్వామీజి తెలిపారు.

Laksha Diparchana
వేడుకగా లక్ష దీపార్చన కార్యక్రమం

By

Published : Dec 13, 2020, 7:01 AM IST

విజయవాడ సత్యనారాయణ పురంలో కార్తీక దీపోత్సవాన్ని... విశ్వహిందూ పరిషత్, శత సహస్ర లక్ష దీపార్చన సేవా మండలి సంయుక్తంగా నిర్వహించాయి. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రానికి చెందిన శివ స్వామీజీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

కరోనా​ నుంచి ప్రజలు కోలుకోవాలని సంకల్పిస్తూ... ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరంలో చెడు తొలిగిపోయి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన నృత్యప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details