నూజివీడు డివిజన్ విస్సన్నపేట మండలం ముత్రాసుపాలెం గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆగకుండా దగ్గు రావడం వల్ల కరోనా మహమ్మారి సోకిందనే భయంతో శానిటైజర్ మింగేసింది. ఈమె విసన్నపేటలో టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంది. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి కావడం వల్ల 108 అంబులెన్స్లో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఏరియా ఆసుపత్రి వైద్య నిపుణులు రవి స్పష్టం చేశారు.
కరోనా సోకిందనే భయంతో శానిటైజర్ తాగిన యువతి - విస్సన్నపేటలో శానిటైజర్ తాగిన మహిళ
ఆగని దగ్గుతో వేగలేక కరోనా మహమ్మారి సోకిందనే అనుమానంతో ఓ యువతి శానిటైజర్ తాగింది. ప్రథమ చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
![కరోనా సోకిందనే భయంతో శానిటైజర్ తాగిన యువతి lady drunk sanitizer because of corona fear](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9250730-948-9250730-1603211625996.jpg)
శానిటైజర్ తాగిన విస్సన్నపేటకు చెందిన మహిళ