ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా.. మహిళా కూలీ మృతి

కూలీ పనులకు వెళ్లిన ఓ మహిళ... డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు విడిచింది. ఇటుకల బట్టీలో పనిచేసే ... అదే పని చేస్తూ మృతి చెందింది.

By

Published : May 18, 2019, 4:36 PM IST

మహిళ మృతదేహం

కూలి పనికి వెళ్లి ప్రాణాలు విడిచింది

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో ఇటుక బట్టీ దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి చెందింది. ట్రాక్టర్లో ఇటుకలు నింపుతుండగా ఒక్కసారిగా తిరగబడింది. అక్కడే పని చేస్తున్న దేవమాత అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమెది ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రొలు గ్రామంగా గుర్తించారు. పనుల నిమిత్తం కొన్నేళ్లుగా వెల్లటూరులోనే నివాసముంటున్నారు. ఈమెకి ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు జి. కొండూరు ఎస్.ఐ రాంబాబు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details