Bansilalpet StepWell Inauguration Today: భాగ్యనగర చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాలను.. తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రత్యేక చొరవతో పునరుద్ధరిస్తున్నాయి. బన్సీలాల్పేట్లో 3శతాబ్దాల క్రితం నిర్మించిన నాగన్నకుంట మెట్లబావికి కొత్త అందాలను అద్దారు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో అప్పట్లో ఈ కట్టడాన్ని నిర్మించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన మెట్లబావిని పునరుద్ధరించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.
పర్యాటకులను ఆకర్షించే విధంగా:సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మెట్లబావి పూర్వవైభవానికి చర్యలు చేపట్టింది. మట్టి, చెత్త, వ్యర్థాలతో పూడుకుపోయిన బావిని 8నెలలపాటు శ్రమించి.. రూపురేఖలు మార్చివేశారు. బావుల వద్ద ఆక్రమణల తొలగింపు, చుట్టూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు.