ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాల ధరలు పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం - పాల ధరల పెంపు వార్తలు

పాడిరైతులకు బాసటగా నిలిచేందుకు.. కృష్ణా మిల్క్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాల ధరను లీటరుకు మరో ఐదు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని.. కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు తెలిపారు. ఇప్పటివరకు లీటరుకు రూ.65గా ఉన్న పాల ధర.. రూ.70కి పెంచామన్నారు.

milk rate
పాల ధరలు పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం

By

Published : Apr 26, 2021, 9:15 PM IST

పాల సేకరణ ధరను లీటరుకు రూ.5 పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు తెలిపారు. కరోనా నిబంధనలను అనుసరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పాల సేకరణ ధర లీటరుకు రూ.65 ఉండగా, రూ.70కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

రైతుల సంక్షేమం కోసం పెంచిన పాల ధర.. మే 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రెండేళ్ల కాలంలో రూ.14 పెంచామన్నారు. దేశంలో ఏ మిల్క్ డైరీ ఇవ్వని రేటును పాల రైతుల సంక్షేమం కోసం.. కృష్ణా మిల్క్ యునియన్ అందిస్తోందన్నారు.

కరోనా ప్రభావంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. పాడిరైతులకు బాసటగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ధరల పెంపు వల్ల వార్షికంగా రూ.34 కోట్ల రూపాయలు అధిక భారం పడుతుందని.. అయినా రైతు సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చలసాని ఆంజనేయులు తెలిపారు. 2020-2021 ఆర్ధిక సంవత్సరంలో.. 15 శాతం వృద్ది రేటుతో రూ.920 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రానికి వర్ష సూచన... 3 రోజులపాటు మోస్తరు వర్షం

ABOUT THE AUTHOR

...view details