ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీరందరూ త్వరగా కోలుకుని మళ్లీ విధుల్లో చేరాలి: ఎస్పీ రవీంద్రనాథ్ - కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ వార్తలు

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న పోలీస్ సిబ్బంది త్వరగా కోలుకుని మళ్లీ విధులకు హాజరు కావాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆకాంక్షించారు. చికిత్స తీసుకుంటున్న పోలీసులతో వీడియో కాల్​లో మాట్లాడారు.

krishna district sp ravindranath video calling at police staff who were corona effected
పోలీస్ సిబ్బందితో వీడియో కాల్​లో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్

By

Published : Jul 26, 2020, 12:31 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహమ్మారిని నియంత్రించడంలో ముందుండి పోరాడుతున్న పలువురు పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. కృష్ణా జిల్లాలో కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న పోలీసు సిబ్బందితో ఎస్పీ రవీంద్రనాథ్ జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్​పై యుద్ధంలో వారందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపి.. త్వరగా కోలుకుని మళ్లీ విధులకు హాజరవ్వాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details