ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్​కు అదనపు వసతులు"

By

Published : Feb 15, 2021, 5:09 PM IST

కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై.. మండల అధికారులతో సమీక్షించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో జనరేటర్ సౌకర్యం, ఇంజినీరింగ్ అసిస్టెన్స్, మహిళా పోలీసు సిబ్బందిని వినియోగించాలని నిర్ణయించారు.

krishna District officials' review
జిల్లా అధికారుల సమీక్ష

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం.. కసరత్తులో వేగం పెంచింది. జిల్లా పాలనాధికారి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. ఎన్నికలు జరగనున్న మండలాధికారులతో జిల్లా పరిషత్ హలులో సమీక్ష నిర్వహించారు.

ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, భద్రతకు సంబంధించిన విషయాలు చర్చించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో జెనరేటర్ సౌకర్యం, ఇంజినీరింగ్ అసిస్టెన్స్, మహిళా పోలీసు సిబ్బంది మోహరింపుతోపాటు.. మరిన్ని వసతులు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details