ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.. అప్రమత్తత అవసరం' - కరోనా వ్యాప్తిపై కలెక్టర్ ఇంతియాజ్ వార్తలు

గతేడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. జిల్లలో కేవలం ఐదు రోజుల్లోనే 450 కొత్త కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరారు.

collector intiyaaz
కరోనా వ్యాప్తిపై కలెక్టర్ ఇంతియాజ్ వార్తలు, కరోనా వ్యాప్తిపై కలెక్టర్ ఇంతియాజ్ వార్తలు

By

Published : Mar 28, 2021, 11:41 AM IST

కృష్ణా జిల్లాలో కేవలం ఐదు రోజుల్లోనే 450 కరోనా కేసులు నమోదయ్యాయని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. గతేడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. కొవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు.

టెస్టింగ్ , ట్రేసింగ్‌, ట్రీట్​మెంట్ ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గిస్సున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 85 వేల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో లాక్ డౌన్ విధించే యోచన లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details