ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 21, 2021, 8:15 PM IST

ETV Bharat / state

'16 మంది ఖైదీలకు 90 రోజుల మధ్యంతర బెయిల్​కు అర్హత'

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 16 మంది ఖైదీలకు 90 రోజుల మద్యంతర బెయిల్​కు అర్హత ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఖైదీలకు బెయిల్​కు సంబంధించిన అంశంపై జిల్లా న్యాయ సేవా అథారిటీ ఛైర్మన్, జిల్లా జడ్జి లక్ష్మణ రావుతో వర్చువల్ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.

collector intiyaaz
collector intiyaaz

కొవిడ్ దృష్ట్యా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో 16 మంది ఖైదీలకు 90 రోజుల మధ్యంతర బెయిల్​కు అర్హత ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. న్యాయసేవా అథారిటీ ఛైర్మన్, ప్రిన్సిపల్ జడ్జి వై. లక్ష్మణరావు ఆధ్వర్యంలో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.

ఐపీసీ-376, పోక్సో చట్టం కింద నేరస్తులు కాని వారిని గుర్తించి బెయిల్ బాండ్లను ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని నుజివీడు, కైకలూరు, గన్నవరం, నందిగామ, జగ్గయ్యపేట, మచిలీపట్నం పరిధిలోని సబ్ జైళ్లలో బెయిల్ అర్హత కలిగిన ఖైదీల వివరాలను కలెక్టర్ వెల్లడించారు.

ఇదీ చదవండి:పడకేసిన అంబులెన్స్​లు.. సామాజిక కార్యకర్తల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details