నందిగామ పూచివాగు వరదలో చిక్కుకున్న ముగ్గురు రైతులు - nandigama latest news

07:37 August 16
పూచివాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు
కృష్ణాజిల్లా నందిగామ మండలంలో పూచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిలో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీరిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తోటలో కూరగాయల కోసం వెళ్లిన వీరు అక్కడే చిక్కుకున్నారు. సహాయక చర్యలను నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, డీఎస్పీ జీ.వి రమణమూర్తి, సీఐ కనకరావు, తహసీల్దార్ చంద్రశేఖర్ పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: దేవీపట్నం వద్ద ఉద్ధృతంగా గోదావరి వరద ప్రవాహం