ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..12కు చేరిన మృతుల సంఖ్య

By

Published : Jun 17, 2020, 2:27 PM IST

Updated : Jun 17, 2020, 5:32 PM IST

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

15:53 June 17

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మృతులు: 

వేమిరెడ్డి ఉదయ్ (6) 

పూడూరు ఉపేందర్‌రెడ్డి(15)

గూడూరు సూర్యనారాయణరెడ్డి (46)

వేమిరెడ్డి పద్మావతి (45) 

లక్కిరెడ్డి అప్పమ్మ 

అక్కమ్మ (45) 

లక్కిరెడ్డి తిరుపతమ్మ (60) 

గూడూరు రమణమ్మ (45) 

వేమిరెడ్డి భారతమ్మ (70) 

రాజి

15:39 June 17

బాధితుల మాటలు

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

14:25 June 17

పన్నెండు మంది దుర్మరణం

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 దైవదర్శనానికి వచ్చి తిరిగి వెళ్తున్న భక్తులను లారీ మృత్యురూపంలో వచ్చి కాటేసింది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి సమీపంలో సిమెంట్ లారీ ఢీకొట్టడంతో పన్నెండు మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తీవ్రంగా గాయపడినవారిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

 ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరంకు చెందిన 26 మంది భక్తులు...వేదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. దైవదర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా... వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను సిమెంట్‌ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ రోడ్డుపక్కకు పడిపోవడంతో పిల్లలు, మహిళలు సహా పన్నెండు మంది చనిపోయారు.

 లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. ట్రాక్టర్‌ను ఢీకొన్న అనంతరం లారీ సైతం రోడ్డుపక్కకు దూసుకుపోవడంతో డ్రైవర్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి

ఇవీ చదవండి:మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తిరగబెట్టిన శస్త్రచికిత్స గాయం

Last Updated : Jun 17, 2020, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details