ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాహుల్ హత్య కేసు: కోరాడను కస్టడీలోకి తీసుకున్న మాచవరం పోలీసులు

By

Published : Sep 7, 2021, 12:15 PM IST

Updated : Sep 7, 2021, 1:12 PM IST

రాహుల్ హత్య కేసు:  కోరాడను కస్టడీలోకి తీసుకున్న మాచవరం పోలీసులు
రాహుల్ హత్య కేసు: కోరాడను కస్టడీలోకి తీసుకున్న మాచవరం పోలీసులు

12:12 September 07

పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు

పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడు కోరాడ విజయ్​కుమార్​ను మాచవరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోరాడతో పాటు మరో నలుగురు నిందితులు సీతయ్య, రాజబాబు , బాబూరావు, అనంత్​లను కూడా కస్టడీకి తీసుకున్నారు. నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి మాచవరం పోలీసుస్టేషన్​కు తరలించారు. రాహుల్ హత్య కేసులో నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌కు విజయవాడ కోర్టు.. రెండు రోజుల  పోలీస్‌ కస్టడీ విధించింది. 

కీలక సమాచారం రాబట్టేందుకే.. 

రాహుల్ హత్య కేసులో పూర్తి స్థాయి సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీకి తీసుకున్నట్లు చెపుతున్నారు. ఇప్పటికే కీలక నిందితుడు కోగంటి సత్యంను పోలీసులు రెండు రోజుల పాటు విచారించి సమాచారం రాబట్టారు . హత్య కేసులో కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్, గాయత్రి వ్యూహ రచన చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన తర్వాత ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడని.. పోలీసులు దీనిపై విచారిస్తారని సమాచారం.

ఇదీ చదవండి:ఈ బిడ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

Last Updated : Sep 7, 2021, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details