ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

hunger strike for Amaravati : ఆర్ 5 జోన్​కు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష.. ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు - సీఆర్డీఏ చట్టానికి సవరణ

hunger strike for Amaravati : అమరావతి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్​ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రకు నిరసనగా ఈ దీక్ష చేపట్టినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్ 5 జోన్ ఏర్పాటు పెద్ద కుట్ర అని శ్రీనివాసరావు ఆరోపించారు.

అమరావతి ఆర్ 5 జోన్
అమరావతి ఆర్ 5 జోన్

By

Published : May 10, 2023, 10:45 AM IST

hunger strike for Amaravati : రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రకు నిరసనగా ఇవాళ్టి(బుధవారం) నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రాజధానిలోని అబ్బురాజుపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దీక్ష ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేయాలనుకున్న వారు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఐదు శాతం భూమిని ఇళ్లు లేని పేదలకు నివాస స్థలాలుగా పంపిణీ చేసే అవకాశం సీఆర్డీఏ చట్టంలో ఉందని.. అలాగే రాజధాని పరిధిలో గత ప్రభుత్వం 5024 టిడ్కో ఇళ్లు నిర్మించిందన్నారు. ఈ రెండు అంశాలను పక్కన పెట్టిన జగన్‌... పారిశ్రామిక అవసరాలకు, ఎలక్ట్రానిక్‌ సిటీ కోసం కేటాయించిన ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ పేరుతో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలని చెప్పి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

రైతుల అభ్యంతరాలు పక్కనపెట్టి.. రైతుల అభ్యంతరాలను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసింది. రాజధాని గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా 500 ఎకరాలతో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆర్-5 జోన్ పరిధిలో మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 900 ఎకరాలు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల అమలుతో పాటు బలహీన వర్గాల ప్రజలకు రాజధాని ప్రాంతంలో నివాస గృహాలు ఇచ్చేందుకే ఆర్ 5 జోన్ అని ప్రభుత్వం చెప్తుండగా.. ఇదంతా కుట్ర అని అమరావతి రైతులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సీఆర్డీఏ చట్టానికి సవరణ.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ 2022 అక్టోబర్‌ 18న జీవో విడుదల చేసింది. రాజధాని పరిధిలో స్థానిక సంస్థలు, ఎన్నికైన పాలకమండళ్లు లేకపోతే ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేసేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించారు. ఈ మేరకు ప్రత్యేక అధికారులతో తీర్మానాలు చేయించి గత అక్టోబర్‌లో ముసాయిదా విడుదల చేయగా.. రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టుకు తెలియకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వబోమని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహిస్తున్నారు.

సీఆర్డీఏ చట్ట ప్రకారం భూమి ఇచ్చిన రైతులు కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములేనని... రైతుల అంగీకారంతోనే సవరణలు చేయాలని వివరిస్తున్నారు.. ఒప్పందం ప్రకారం పాతికేళ్లవరకూ మాస్టర్‌ ప్లాన్‌ మార్చడానికి వీల్లేదని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత కూడా మాస్టర్‌ ప్లాన్‌పై ప్రత్యేక అధికారులకు హక్కులు, అధికారులుండవని స్పష్టం చేస్తున్నారు.

శ్రీనివాసరావు అరెస్ట్...అమరావతి జేఏసీ నేత కోలికపూడి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ 5 జోన్ కి వ్యతిరేకంగా నేడు అబ్బురాజు పాలెంలో నిరాహారదీక్ష చేస్తానని కొలికపూడి తెలిపారు. అబ్బురాజుపాలెం వెళుతుండగా చంద్రబాబు నివాసం వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్5 జోన్ ఏర్పాటు లో భాగంగా ప్రభుత్వం 1134ఎకరాలు స్థానికేతరులకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వ చూపటాన్ని రాజధాని రైతులు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే అదనంగా మరో 268 ఎకరాలు స్థానికేతరలకు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భూములిచ్చిన రైతులకు చట్ట ప్రకారం ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వకుండా రైతులకు, పేదలకు మధ్య చిచ్చుపెట్టే కుట్రలో భాగంగా ఆర్5 జోన్ ఏర్పాటును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేగవంతం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details