ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 20, 2021, 2:58 PM IST

ETV Bharat / state

'తెదేపా మహిళా అభ్యర్థిపై దాడి చేయడం దారుణం'

విజయవాడ 3వ డివిజన్‌లో కార్పొరేటర్‌గా పోటీచేస్తున్న తెలుగుదేశం మహిళా అభ్యర్థి వాణిపై... వైకాపా కార్యకర్తలు దాడి చేయడం దారుణమని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. విజయవాడ 3వ డివిజన్​లో మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో కేశినేని నాని పాల్గొన్నారు.

kesineni fires on devineni avinash
kesineni fires on devineni avinash

విజయవాడ 3వ డివిజన్‌లో కార్పొరేటర్‌గా పోటీచేస్తున్న తెలుగుదేశం మహిళా అభ్యర్థి వాణిపై వైకాపా కార్యకర్తల దాడిని ఎంపీ కేశినేని నాని ఖండించారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మారాక.. ఇలాంటి దౌర్జన్యాలకు దిగడం దేవినేని అవినాష్‌కు తగదని హెచ్చరించారు. విజయవాడ 3వ డివిజన్​లో మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో కేశినేని నాని పాల్గొన్నారు.

ఎన్ని బెదిరింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని కార్పొరేటర్ అభ్యర్థి వాణి తెలిపారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహనరావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేతలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని.. ఉపాధి కోల్పోయి ఎంతోమంది రోడ్డున పడ్డారని ఆరోపించారు.

ఇదీ చదవండి: ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details