ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో జేసీ తనిఖీలు - krishna district Jc inspections in private hospitals news

కొవిడ్​ సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించి.. తనిఖీలు నిర్వహించారు. కృష్ణాజిల్లాలోని పలు ఆస్పత్రులపై జేసీ చర్యలు తీసుకున్నారు.

Jc inspections in private hospitals
బాధితులతో మాట్లాడుతున్న జాయింట్​ కలెక్టర్ శివశంకర్

By

Published : Apr 20, 2021, 12:02 PM IST

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించి.. కృష్ణాజిల్లా జాయింట్​ కలెక్టర్ శివశంకర్​​ పలు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని రెండు ప్రైవేట్​ హాస్పిటల్స్​పై చర్యలు తీసుకున్నారు. అనుమతి లేకుండా కొవిడ్ సేవలందిస్తున్న అనిల్ న్యూరో ఆస్పత్రి వారికి రూ.2 లక్షల జరిమానా విధించారు.

కొవిడ్​ బాధితులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రులు ప్రభుత్వ జీవో నెం.77 ప్రకారం రుసుము వసూలు చేయాలి. రోజుకు రూ.10 నుంచి రూ.15 వేలకు మించి ఛార్జ్​ చేయకూడదు. జిల్లాలోని కొన్ని ఆస్పత్రుల్లో రోజువారి రుసుము లక్షల్లో ఉంటోంది. చికిత్స అందించేందుకు కొన్ని హాస్పిటల్స్​కు కలెక్టర్​ అనుమతులివ్వగా.. మరికొన్ని అనధికారికంగా చికిత్స ప్రారంభించాయి. ఎక్కడా.. ప్రభుత్వం సూచించిన రుసుముకు సేవలు అందించట్లేదని బాధితులు చెబుతున్నారు. వైద్యులు ధరించే పీపీఏ కిట్, ఆక్సిజన్, వెంటిలేటర్ ఇలా అన్నింటికీ భారీగా ధరలను నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఏదైనా సమస్య వస్తే 104, 1092 నెంబర్లకు ఫోన్ చేయాలని బాధితులకు జేసీ తెలిపారు.

ఇదీ చదవండి:చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం... పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలూ అధికం

ABOUT THE AUTHOR

...view details