ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 18, 2019, 8:57 PM IST

ETV Bharat / state

ప్రపంచ కప్ లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం: ఎమ్మెస్కే

భారత క్రికెట్ జట్టు సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​ ఎమ్మెస్కే ప్రసాద్​.. కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. రాబోయే టీ20 ప్రపంచ కప్​లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.

'యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది'

'యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది'

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్​ కప్​ను​ గెలుచుకుంటామని భారత జట్టు సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​ ఎమ్మెస్కే ప్రసాద్​ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో 'జెసిఐ' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నడక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులను ఖండించారు. ఎన్టీఆర్​ క్రీడా మైదానం సభ్యులు ఆయన్ను సన్మానించారు. రాబోయే టీ20 వరల్డ్​ కప్​లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో జట్టు పటిష్ఠంగా ఉందన్నారు. బీసీసీఐ ఛైర్మన్​గా సౌరవ్​ గంగూలీ విజయవంతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details