ప్రపంచ కప్ లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం: ఎమ్మెస్కే - msk prasad visits krishna district
భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్.. కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. రాబోయే టీ20 ప్రపంచ కప్లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంటామని భారత జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో 'జెసిఐ' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నడక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులను ఖండించారు. ఎన్టీఆర్ క్రీడా మైదానం సభ్యులు ఆయన్ను సన్మానించారు. రాబోయే టీ20 వరల్డ్ కప్లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో జట్టు పటిష్ఠంగా ఉందన్నారు. బీసీసీఐ ఛైర్మన్గా సౌరవ్ గంగూలీ విజయవంతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.