కరకట్ట విషయంలో సీఆర్డీఏకు హైకోర్టులో చుక్కెదురు - NTR JAYANTI
సీఆర్డీఏ తనకు జారీ చేసిన షోకాజ్ నోటిసులపై అభ్యంతరాలు లేవనెత్తిన ఓ వ్యక్తి వాదనలను హైకోర్టు సమర్థించింది.

కృష్ణానదికి 100 మీటర్లలోపు భవన నిర్మాణాలకు తావులేదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని కేదారిష్ అనే ఓ ఇంటి యజమానికి సీఆర్డీఏ అధికారులు సంజాయిషీ నోటీసు ఇచ్చారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేదారిష్ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ నోటీసు అమలును 3 వారాలు నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఆర్డీఏ కమిషనర్ అప్పీల్ దాఖలు చేశారు. దానిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.... తీర్పు వాయిదా వేసింది. సోమవారం నిర్ణయాన్ని వెల్లడించింది. షోకాజ్పై కేదారిష్ లేవనెత్తిన ఆభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీచేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. అప్పటి వరకు ఆయనకు చెందిన భవనం విషయంలో యధాతథ స్థితి (స్టేటస్కో)కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది
TAGGED:
NTR JAYANTI