ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 30, 2020, 8:05 PM IST

Updated : Mar 30, 2020, 8:49 PM IST

ETV Bharat / state

కరోనా కాలం.. స్వచ్ఛంద సంస్థల మానవత్వం

కరోనా కష్ట కాలంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు మానవత్వాన్ని చాటుకుంటున్నాయి. ఆపన్నులకు ఆహారం పంపిణీ చేస్తూ.. ఆకలి తీరుస్తున్నాయి. ఇంటింటికీ ఉచితంగా కూరగాయలు అందిస్తూ పేదలకు బాసటగా నిలుస్తున్నాయి.

in lockdown period so many of them helping to poor people
కరోనా కాలంలో మానవత్వం చాటుతున్న స్వచ్ఛంద సంస్థలు

కరోనా కాలంలో మానవత్వం చాటుతున్న స్వచ్ఛంద సంస్థలు

అనంతపురంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రైవేట్ బస్సుల యజమానులు అల్పాహారం పొట్లాలు అందించారు. లాక్‌డౌన్‌ కొనసాగినన్ని రోజులూ కొనసాగిస్తామని తెలిపారు. కడప జిల్లా ఎర్రగుంట్ల 8వ వార్డులో మన ఉరి కోసం ట్రస్ట్ ప్రతినిధులు.. కూలీలకు కూరగాయలు పంపిణీ చేసింది. అనంతపురానికి చెందిన దేవదర్శన్‌.. సైకిల్‌ కొనుక్కునేందుకు ముంతల్లో పోగుచేసిన నగదును కరోనా సహాయక చర్యల కోసం కలెక్టర్‌కు అందజేశాడు. ప్రభుత్వం అనుమతిస్తే అన్నక్యాంటీన్లలో పేదలకు భోజనం పెడతామని నరసరావుపేట తెదేపా ఇంచార్జీ చదలవాడ అరవింద బాబు ముందుకు వచ్చారు. తన సొంత ఖర్చులతో పేదలకు భోజనం పెడతామన్నారు.

ప్రకాశంజిల్లా చీరాలలో రెడ్ క్రాస్ సభ్యులు.. రోడ్డుపైనే బతుకీడుస్తున్నవారికి ఆహార పొట్లాలు పంచారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఐఆర్​సీటీసీ అమృత హస్తం స్వచ్ఛంద సంస్థతో కలిసి విజయవాడలో పేదలకు ఆహారం అందించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఎనికేపాడులో ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. జగ్గయ్యపేట పట్టణ శివారు తొర్రగుంటపాలెంలోని మారుతీ యూత్ గ్రామంలోనూ పట్టణ శివార్లలోనూ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గోడలపై చిత్రాలు, రాతలతో ప్రచారం చేశారు.

విశాఖ జిల్లా పాడేరులో టైలర్ శివరాత్రి శ్రీనివాస్.. తాను సొంతంగా కుట్టిన సుమారు వెయ్యి మాస్క్‌లను వర్తకులకు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటకు చెందిన కొబ్బరివ్యాపారి తాతాజీ మాచవరం గ్రామస్థులకు కూరగాయలు అందజేశారు. తునిలో పాత్రికేయులు లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ఆహారం అందించారు. ఏలేశ్వరం మండలం తిరుమాలి ఎర్రవరంలో వైకాపా శ్రేణులు, నాయకులు... మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. సిరిపురంలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కిర్లంపూడి మండలం ముక్కోలులో కూరగాయలు పంచారు.

ఇదీ చూడండి:

డ్రోన్​ సాయంతో ప్రభుత్వాసుపత్రి ఆవరణలో పిచికారి

Last Updated : Mar 30, 2020, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details