ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 24, 2021, 11:04 PM IST

ETV Bharat / state

రెండేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్​ను కారు ఢీకొన్న ఘటనలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

two years boy died in an accident
రెండేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద ఎదురుగా వస్తున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. జగ్గయ్యపేట పట్టణం చెరువు బజారుకు చెందిన కుంచపు యోగానంద లక్ష్మీ నరసింహ, చాందిని దంపతులు వారి రెండేళ్ల కుమారుడు శివతేజతో కలిసి స్కూటీపై మధిర వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బాలుడు శివతేజ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన అతడి తల్లిదండ్రులను 108 వాహనంలో జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:వెనుక నుంచి లారీని ఢీకొని.. వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details