ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసీదుల్లో 11 టన్నులు... లారీలో 28 టన్నులు..! - కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు

కృష్ణా జిల్లా నందిగామ వద్ద అక్రమంగా ఇసుక సరఫరా చేస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్యగూడెం ఇసుక రీచ్ నుంచి గన్నవరం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. 11 టన్నుల ఇసుక బుక్ చేసుకుని లారీలో 28 టన్నులు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

illegal sand transport in subbayyagudem reach in krishna district
కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా

By

Published : Jun 25, 2020, 7:36 AM IST

ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పర్యవేక్షణలో ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు చురుకుగా వ్యవహరిస్తూ అక్రమదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఎస్​ఐ బాషాకి అందిన సమాచారం మేరకు నందిగామ మార్కెట్ యార్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.

సుబ్బయ్యగూడెం ఇసుక రీచ్ నుంచి గన్నవరం వెళుతున్న ఇసుక లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వద్ద రసీదుల్లో రాఖీ ఎవెన్యూ ప్రైవేటు లిమిటెడ్ పేరు మీద 11 టన్నులు ఉండగా... లారీలో 28 టన్నుల ఇసుక ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details