ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణానదిలో యువకుడి మృతదేహం గుర్తింపు

పులిగడ్డ అక్విడెక్ట్ సమీపంలోని కృష్ణానదిలో గుర్తుతెలియని ఓ యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Jun 16, 2021, 5:14 PM IST

కృష్ణానదిలో అనుమానస్పదస్థితిలో యువకుడి మృతదేహం గుర్తింపు
కృష్ణానదిలో అనుమానస్పదస్థితిలో యువకుడి మృతదేహం గుర్తింపు



కృష్ణాజిల్లా పులిగడ్డ అక్విడెక్ట్ సమీపంలో కృష్ణానదిలో యువకుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అవనిగడ్డ సబ్​ ఇన్​స్పెక్టర్ కె.శ్రీనివాసరావు.. యువకుడి మృతదేహాన్ని పరిశీలించి.. అవనిగడ్డ మండలం, సీతాయలంకకు చెందిన ఒడుగు సతీశ్​గా​ గుర్తించారు. మృతదేహానికి అవనిగడ్డ ఆసుపత్రిలో పోస్ట్​మార్టం చేయనున్నట్లు తెలిపారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details