ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్​వేర్​, రూ.15 లక్షలు చోరీ' - Manipulations in Sri Chaitanya educational institutions news

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పునాదిపాడు పరిధిలో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలో అవకతవకలు జరిగినట్లు కంకిపాడు పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు అయ్యింది. వంద కోట్ల విలువైన సాఫ్ట్​వేర్​, పదిహేను లక్షల నగదు చోరీ అయినట్లు ప్రస్తుత ఏజీఎం ఫిర్యాదులో పేర్కొన్నారు.

manipulations
శ్రీ చైతన్య విద్యాసంస్థలో అవకతవకలు

By

Published : May 30, 2021, 4:31 PM IST

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పునాదిపాడు పరిధిలో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలో అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత ఏజీఎం మురళీకృష్ణ కంకిపాడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్​వేర్​, పదిహేను లక్షల నగదు చోరీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కళాశాలలో గతంలో ఎగ్జిక్యూటివ్​ డీన్​గా పని చేసిన నరేంద్రబాబు మరో నలుగురు సిబ్బంది ఈ అవకతవకలకు పాల్పడ్డారని… మురళీకృష్ణ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నరేంద్రబాబు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గోసలైట్స్ కోచింగ్ సెంటర్​లో… తమ కాలేజీ విద్యార్థులను చేర్పించాలని వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారని మురళీకృష్ణ ఆరోపిస్తున్నారు. చోరీ చేసిన సాఫ్ట్​వేర్​, నగదు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మురళీ కృష్ణ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గారావు తెలిపారు.

ఇదీ చదవండి:'రైతుభరోసా కేంద్రాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌'

ABOUT THE AUTHOR

...view details