ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 14, 2021, 5:24 PM IST

ETV Bharat / state

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం.. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం

కృష్ణా జిల్లా పోటుమీద గ్రామంలో ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో.. సామగ్రి కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే నష్టం జరిగిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

house burnt in fire accident
పోటువీద గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

కృష్ణా జిల్లా కోడూరు మండలం పోటుమీద గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ ఇల్లు దగ్ధమైంది. అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో సామగ్రి పూర్తిగా కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరగి ఉండవచ్చని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details