ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధరణ పరీక్షలు చేయించండి: హైకోర్టు సూచన - విజయవాడ

రాజమండ్రి జైల్లో ఓ వ్యక్తి ఎయిడ్స్ చికిత్స కోసం రెండు నెలలు బెయిల్ కావాలని వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అధికారులకు పలు సూచనలు చేసింది.

ఎయిడ్స్ చికిత్స కోసం బెయిల్ పిటిషన్​పై హై కోర్టు విచారణ..

By

Published : Sep 7, 2019, 1:50 AM IST

ఎయిడ్స్ చికిత్స కోసం బెయిల్ పిటిషన్​పై హై కోర్టు విచారణ..

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఓ ఎయిడ్స్‌ ఖైదీ చికిత్స కోసం బెయిల్‌ కావాలని వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సంబంధింత అధికారులకు కోర్టు పలు సూచనలు చేసింది. జైలులోకి వచ్చేటప్పుడు ఖైదీలకు ఎయిడ్స్‌ నిర్ధరణ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించింది. ఎయిడ్స్‌ ఖైదీలకు ప్రత్యేకంగా వైద్య సదుపాయాలు కల్పించాలని, ఒకవేళ జైలులో అందుబాటులో లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిచాలని, వైద్యులు సూచించిన విధంగా పోషకాహర విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించింది. ఎంతమందికి ఖైదీలకు ఎయిడ్స్‌ ఉందనే విషయంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని కోరింది. స్వలింగ సంపర్కం జరిగే ప్రమాదం ఉన్నందున దాన్ని జరగకుండా జైలు అధికారులే చూసుకోవాలని తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details