సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 6 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి 3.64 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని పొలాలకు వదులుతున్నారు.
పులిచింతలకు భారీగా వరద నీరు - water
పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 6 టీఎంసీలుగా ఉంది.
![పులిచింతలకు భారీగా వరద నీరు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4120607-314-4120607-1565672290399.jpg)
పులిచింతల ప్రాజెక్టులోకి చేరిన వరద నీరు