ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 19, 2020, 2:34 PM IST

ETV Bharat / state

నగదు తరలింపు వెనుక పెద్దల హస్తం: నిమ్మల రామానాయుడు

చెన్నైలోని సూట్​కేసు కంపెనీలకు రాష్ట్ర నుంచి నగదు వెళ్తోందని తెదేపా నేత నిమ్మల రామానాయుడు చెప్పారు. ఒక్క వాహనంలోనే 5.27 కోట్ల రూపాయలు దొరికాయన్న ఆయన... ఇలా ఎన్ని వాహనాల్లో తరలి వెళ్తుందో తెలియాలన్నారు.

nimmala ramanaidu
nimmala ramanaidu

రాష్ట్రంలో అవినీతి సొమ్ము సూట్‌కేసు కంపెనీలకు తరలి వెళ్తోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. చెన్నైలో ఒకే అడ్రస్‌లో 3 సూట్‌కేసు కంపెనీలు ఉన్నాయని ఆరోపించారు. ఒక్క వాహనంలోనే 5.27 కోట్ల రూపాయలు దొరికాయన్న ఆయన... ఇలా ఎన్ని వాహనాల్లో తరలి వెళ్తుందో తెలియాలన్నారు.

అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు వాహనాలు ఎలా తరలి వెళ్తున్నాయని ప్రభుత్వాన్ని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. నగదు తీసుకెళ్లిన కారును రాష్ట్ర సరిహద్దుల్లో ఎందుకు తనిఖీ చేయలేదని నిలదీశారు. నగదు తరలింపును పోలీసులు అడ్డుకోవడం లేదని ఆరోపించారు. నగదు తరలింపు వెనుక పెద్దల హస్తం ఉందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details