ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో మగువలపై పెరుగుతున్న వేధింపులు - laddies harrasments in facebook

ఫేస్ బుక్ ,ఇన్​స్టాగ్రామ్​ల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. పరిచయం ఉన్నవారే శత్రువులుగా మారుతున్నారు. వ్యక్తి గత వివరాలు తెలుసుకుని మహిళల పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరచి అశ్లీల పదజాలంతో స్నేహితులకు మెస్సేజ్​లు పంపుతున్నారు. ఇలాంటి ఘటనలు కృష్ణా జిల్లా విజయవాడలో ఎక్కువగా జరుగుతున్నాయి.

harassment on women in Facebook and Instagram cases filed in Krishna dst Vijayawada bhavanipuram ps
harassment on women in Facebook and Instagram cases filed in Krishna dst Vijayawada bhavanipuram ps

By

Published : Jul 14, 2020, 11:05 AM IST

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానమే ఒక్కోసారి ప్రమాదాలకు దారితీస్తుంది. ఫేస్ బుక్, ఇన్​గ్రామ్​ల్లో చాటింగ్, మనకు నచ్చిన పోస్టింగ్​లు పెట్టుకోవచ్చు. ఇదే అదనుగా చూసుకుని విజయవాడలో కొంతమంది మహిళలను వేధిస్తున్నారు. మొదట పరిచయం పెంచుకొని తర్వాత వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటారు.

ఫేస్ బుక్​లో అప్ లోడ్ చేసిన ఫొటోలతో నకిలీ ఖాతాలను తెరచి మహిళలను వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. విజయవాడ పెనమలూరుకు చెందిన మహిళకు ఓ అగంతుకుడు ఫోన్ చేసి తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే అశ్లీల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాడు.

దీంతో షాక్​తిన్న బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఖాతాగా గుర్తించారు. నిందితుడు బాధితురాలి పేరుతో నకిలీ ఖాతాలు తెరుస్తున్నట్లు గుర్తించారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు రెండు రోజులకు ఒక కొత్త ఇన్​స్టాగ్రామ్ ఖాతాను తెరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు విశాఖలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలికి పరిచయమున్న వ్యక్తే వేధించాడని విచారణలో తేలింది.

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు పొందుపరచవద్దని పోలీసులు సూచించారు. లైక్​ల కోసం, ఫాలోవర్స్​ను పెంచుకునేందుకు జీవితాన్నినాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి

ఎంసెట్ సహా...పలు ప్రవేశ పరీక్షలు వాయిదా: మంత్రి సురేశ్‌

ABOUT THE AUTHOR

...view details