ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కూలిన తరగతి పైకప్పు.. విద్యార్థులుంటే పరిస్థితేంటి..!

By

Published : Oct 28, 2019, 7:35 PM IST

కృష్ణా జిల్లా సూరంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతి గది పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ ఘటన సమయంలో విద్యార్థులు తరగతి గదిలో లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

కూలిపోయిన తరగతి పైకప్పు.. విద్యార్థులుంటే పరిస్థితేంటీ..!

కూలిపోయిన తరగతి పైకప్పు.. విద్యార్థులుంటే పరిస్థితేంటీ..!
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతి గది పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విద్యార్థులు బయట ఉండడం వలన పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో మొత్తం 85 మంది విద్యార్థులు ఉండగా.. పైకప్పు కూలిన తరగతి గదిలో 35 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెంకులతో ఉన్న పాఠశాల పైకప్పు నాని ఒక్కసారిగా కుప్ప కూలిందని ఉపాధ్యాయులు తెలిపారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details