బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు చెప్పారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్నారు. చిన్నారులు దేశానికి నిజమైన బలం, సమాజానికి పునాది అని పేర్కొన్నారు. వారిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ పౌరులుగా.. మాతృభూమిని రక్షించి, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించాలని ఆకాంక్షించారు.
బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ రాష్ట్ర గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులే సమాజానికి పునాది అని ఆయన అన్నారు.
బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్