చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ నిర్వాకం వల్ల ఖైదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. యనమలమంద గ్రామంలో ఎస్సీ బాలికకు వివాహం చేశారనే నెపంతో స్థానిక ఎస్సై ఓ యువకుడిని చితకబాదారని మండిపడ్డారు.
జైలు పాలు చేశారు..
బాధితుడ్ని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించిన 25 కుటుంబాలకు చెందిన 86 మంది ఎస్సీలను జైలు పాలు చేశారని ధ్వజమెత్తారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరిగినా ఆయన నోరెత్తడం లేదని ఎద్దేవా చేశారు.