ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు అరెస్ట్

విజయవాడ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది గ్యాంగ్ వార్. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

By

Published : Jul 14, 2020, 10:43 PM IST

gang war accused
gang war accused

విజయవాడ నగరంలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత కుమార్ అనే రౌడీషీటర్ తో పాటు అజయ్, శంకర్, మస్తాన్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో రెండు ముఠాలకు చెందిన 50 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పెనమలూరుకు చెందిన రౌడీషీటర్ అనంతకుమార్ పై 6 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండటంతో.. అతన్ని 6 నెలల పాటు నగర బహిష్కరణ విధించినట్లు పోలీసులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details